Telangana: తెలంగాణలో కొత్తగా 220 కరోనా పాజిటివ్ కేసులు

Telangana corona updates

  • గత 24 గంటల్లో 51,004 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 71 మందికి పాజిటివ్
  • పలు జిల్లాల్లో కొత్త కేసులు నిల్
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 5,351 మందికి చికిత్స

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 51,004 కరోనా పరీక్షలు నిర్వహించగా, 220 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 71 కొత్త కేసులు నమోదు కాగా, నల్గొండ జిల్లాలో 17, ఖమ్మం జిల్లాలో 12, రంగారెడ్డి జిల్లాలో 12 కేసులు వెల్లడయ్యాయి. వికారాబాద్, నిర్మల్, నారాయణపేట, కామారెడ్డి, జోగులాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 338 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,61,006 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,51,763 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,351 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,892కి పెరిగింది.

Telangana
Corona Virus
New Cases
Today Cases
Deaths
  • Loading...

More Telugu News