Telangana: తెలంగాణలో తాజాగా 298 మందికి కరోనా పాజిటివ్

Telangana corona media report

  • గత 24 గంటల్లో 68,097 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 89 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 5,476 మందికి చికిత్స

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 68,097 కరోనా పరీక్షలు నిర్వహించగా, 298 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 89 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 24, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 21, వరంగల్ అర్బన్ జిల్లాలో 21 కేసులు వెల్లడయ్యాయి. నారాయణపేట, నిర్మల్, కొమరంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 325 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,60,142 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,50,778 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,476 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా మృతుల సంఖ్య 3,888కి పెరిగింది.

Telangana
Corona Virus
Media Report
Daily Cases
Deaths
Update
  • Loading...

More Telugu News