త్రివిక్రమ్ సినిమా విషయంలో ప్లానింగ్ మార్చిన మహేశ్!
- మహేశ్ ప్లానింగులో మార్పు
- 'సర్కారువారి పాట' పూర్తి చేయడంపై దృష్టి
- దసరాకి లాంఛనంగా మొదలు
- నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్
కానీ మహేశ్ బాబు మనసు మార్చుకున్నాడట. కరోనా కారణంగా ఇప్పటికే 'సర్కారువారి పాట' షూటింగు పరంగా ఆలస్యమైంది. మళ్లీ ఆ సినిమా షూటింగుకు బ్రేక్ ఇచ్చి, త్రివిక్రమ్ సినిమా చేయడం వలన మరికాస్త ఆలస్యమవుతుంది. అందువలన ముందుగా 'సర్కారువారి పాట' షూటింగును పూర్తిచేయాలని నిర్ణయించుకున్నాడని అంటున్నారు.
త్రివిక్రమ్ తో చేయనున్న సినిమాను దసరా పండుగ రోజున లాంఛనంగా ప్రారంభించి. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగుకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో మహేశ్ జోడీగా పూజ హెగ్డే - నభా నటేశ్ అలరించనున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.