Chittoor District: చిత్తూరు జిల్లా కరబలకోటలో పదిమంది విద్యార్థులకు కరోనా.. ఆరోగ్యంగానే ఉన్నారన్న వైద్యులు

10 students infected to corona in karabalakot chittoor dist

  • విద్యార్థులకు కరోనా సోకిన విషయాన్ని గుర్తించిన స్థానిక వైద్యురాలు
  • ఉన్నతాధికారులకు సమాచారం
  • వెంటనే విద్యార్థులకు చికిత్స

చిత్తూరు జిల్లా కరబలకోట మండలంలోని ఓ విద్యాసంస్థలో చదువుకుంటున్న పదిమంది విద్యార్థులు సహా 11 మంది కరోనా బారినపడ్డారు. విద్యార్థులకు కరోనా సోకినట్టు గుర్తించిన స్థానిక వైద్యురాలు ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన కరబలకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి అనూహ్య విద్యార్థులకు చికిత్స అందించారు. ప్రస్తుతం వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని, భయపడాల్సిన అవసరం లేదని అనూహ్య తెలిపారు.

  • Loading...

More Telugu News