Telangana: తెలంగాణలో తాజాగా 338 మందికి కరోనా పాజిటివ్

Telangana covid cases daily update

  • గత 24 గంటల్లో 74,207 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 84 కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 5,864 మందికి చికిత్స

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 74,207 కరోనా పరీక్షలు నిర్వహించగా, 338 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 84 కొత్త కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 30, వరంగల్ అర్బన్ జిల్లాలో 27 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వికారాబాద్, నారాయణపేట, కామారెడ్డి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 364 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒక మరణం సంభవించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,58,054 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,48,317 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,864 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,873కి పెరిగింది.

Telangana
Corona Virus
COVID19
Daily Update
  • Loading...

More Telugu News