India: ఆఫ్ఘ‌నిస్థాన్ నుంచి 168 మందితో ఘ‌జియాబాద్ చేరుకున్న విమానం

indian flight reaches ghaziabad

  • భార‌తీయుల‌ను స్వదేశానికి తీసుకొస్తోన్న కేంద్రం
  • కాబూల్ నుంచి ఘ‌జియాబాద్ కు విమానం
  • అందులో 107 మంది భార‌తీయులు  

ఆఫ్ఘనిస్థాన్ తాలిబ‌న్ల చేతుల్లోకి వెళ్లిన నేప‌థ్యంలో అక్క‌డ భార‌తీయుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం స్వ‌దేశానికి తీసుకొస్తోన్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా కాబూల్‌ నుంచి భారత వైమానిక దళానికి చెందిన ఓ విమానం ప్ర‌యాణికుల‌తో ఘ‌జియాబాద్ చేరుకుంది.

ఆ విమానంలో 107 మంది భార‌తీయులు స‌హా మొత్తం 168 మంది ఉన్నారు. హిండ‌న్ వైమానిక స్థావ‌రంలో ఆ విమానం దిగింది. అక్క‌డి నుంచి భార‌తీయులు త‌మ సొంత ప్రాంతాల‌కు వెళ్ల‌నున్నారు. ఇప్ప‌టికే ఆఫ్ఘ‌నిస్థాన్ నుంచి భార‌త్ ప‌లు ద‌శ‌ల్లో భార‌తీయుల‌ను స్వ‌దేశానికి తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే.


  • Loading...

More Telugu News