Nara Lokesh: దిశ చట్టం, దిశ యాప్ పేరుతో ప్రచారం చేసుకోకండి... పబ్లిసిటీయే సిగ్గుపడుతుంది: నారా లోకేశ్

Nara Lokesh criticizes CM Jagan over atrocities on girls

  • విజయనగరం జిల్లాలో ఘటన
  • యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు
  • తీవ్రంగా స్పందించిన లోకేశ్
  • మూడు రోజుల్లో మూడు ఘటనలు అంటూ ఆగ్రహం

విజయనగరం జిల్లా చౌడవాడలో యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన పట్ల టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. మూడు రోజుల్లో ఆడపిల్లలపై మూడు అమానవీయ ఘటనలు జరిగినా ఈ దున్నపోతు ప్రభుత్వంలో స్పందనలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపిల్లలపై అరాచకాలకు ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిందని విమర్శించారు. గుంటూరులో క్రిమినల్ కత్తిపోట్లకు మొన్న రమ్య నేలకొరిగితే, నిన్న గుంటూరు రాజుపాలెంలో ఓ చిన్నారి పశువాంఛలకు బలైందని తెలిపారు. నేడు విజయనగరం జిల్లాలో ఓ ఉన్మాది పెట్రోల్ పోసి యువతిని తగులబెట్టాడని లోకేశ్ వివరించారు.

"జగన్ గారూ... మీ ఇంట్లో మహిళలకు రక్షణ లేదు, మీ ఇంటి పక్కన నివసించేవారు కూడా అత్యాచారానికి గురయ్యారు. మీ పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్కరికీ భద్రత లేకుండా పోయింది. ప్రజలు భయంభయంగా బతుకుతున్నారు. ఇంకా లేని దిశ చట్టం, రక్షించలేని దిశ యాప్ పేరుతో ప్రచారం చేసుకోకండి... పబ్లిసిటీయే సిగ్గుపడుతుంది. నిందితుల్ని పట్టుకుని శిక్షించడంలో ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తే రోజుకొకడు ఈ విధంగా మృగంలా ప్రవర్తించడు" అని హితవు పలికారు.

"బాధితులను బాధిస్తూ, నిందితులను రక్షించే ప్రభుత్వం అని స్పష్టం కావడంతో నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. ఇలాంటి ఘటనలపై దయచేసి దృష్టి సారించండి. ఆడపిల్లల ఉసురు తగిలితే మీకూ, ఈ రాష్ట్రానికి మంచిది కాదు" అని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News