Telangana: నేడు తెలంగాణలో 409 కరోనా కేసులు

Telangana corona cases details

  • గత 24 గంటల్లో 88,308 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 71 కేసులు
  • రాష్ట్రంలో ముగ్గురి మృతి
  • ఇంకా 6,865 మందికి చికిత్స

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 88,308 కరోనా పరీక్షలు నిర్వహించగా 409 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 71, కరీంనగర్ జిల్లాలో 45 కేసులు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 453 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,54,035 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,43,318 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,865 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,852కి పెరిగింది.

Telangana
Corona Virus
New Cases
Deaths
  • Loading...

More Telugu News