Andhra Pradesh: ఏపీలో మరోసారి 15 వందలు దాటిన పాజిటివ్ కేసులు.. అప్డేట్స్ ఇవిగో!

AP registers more than 1500 cases in 24 hours

  • 24 గంటల్లో 1,501 పాజిటివ్ కేసుల నమోదు
  • రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది మృతి
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 15,738

ఏపీలో కరోనా కొత్త పాజిటివ్ కేసులు మరోసారి 15 వందల మార్కును దాటాయి. గత 24 గంటల్లో 67,716 మంది శాంపిల్స్ ని పరీక్షించగా 1,501 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 315 కేసులు నమోదు కాగా.. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 6 కేసులు నమోదయ్యాయి.

ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,697 మంది కోలుకోగా... 10 మంది మృతి చెందారు. తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 19,98,603కి పెరగగా... 19,69,169 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 13,696 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15,738 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  

  • Loading...

More Telugu News