Andhra Pradesh: ఏపీ రోజువారీ కొవిడ్ కేసుల వివరాలు ఇవిగో!

AP covid cases details

  • గత 24 గంటల్లో 70,757 కరోనా పరీక్షలు
  • తూర్పుగోదావరి జిల్లాలో 402 కేసులు
  • కర్నూలు జిల్లాలో 19 మందికి పాజిటివ్
  • రాష్ట్రంలో 13 మంది మృతి
  • ఇంకా 18,688 మందికి చికిత్స

ఏపీలో గడచిన 24 గంటల్లో 70,757 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,859 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 402 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 233, నెల్లూరు జిల్లాలో 225 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 1,575 మంది కరోనా నుంచి కోలుకోగా, 13 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి ఏపీలో కరోనా మృతుల సంఖ్య 13,595కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,88,910 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,56,627 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 18,688 మంది చికిత్స పొందుతున్నారు.

Andhra Pradesh
Corona Virus
COVID19
New Cases
  • Loading...

More Telugu News