Andhra Pradesh: ఏపీలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు... అప్ డేట్స్!

AP Registers 1461 Corona new cases

  • 24 గంటల్లో 1,461 కేసుల నమోదు
  • రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది మృతి
  • ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 18,882

ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 1,461 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా 235 కేసులు నమోదు కాగా... కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 12 కేసులు నమోదయ్యాయి.

ఇదే సమయంలో 2,113 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది మహమ్మారి కారణంగా మృతి చెందారు. తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 19,85,182కి చేరుకోగా... 19,52,736 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 13,564 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,882 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Andhra Pradesh
Corona Virus
Updates
  • Loading...

More Telugu News