CBI: విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు పిటిష‌న్‌పై విచార‌ణ‌ వాయిదా.. కౌంట‌ర్ దాఖ‌లుకు మ‌రింత గ‌డువు కోరిన సీబీఐ

trial in cbi court on raghurama petition

  • విచారణ ఈ నెల 13కు వాయిదా
  • విజయసాయిరెడ్డి కోర్టు షరతులు ఉల్లంఘించారంటూ పిటిష‌న్
  • ఈ నెల 7న పిటిషన్ వేసిన‌ రఘురామ కృష్ణ‌రాజు

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణ‌రాజు దాఖ‌లు చేసిన‌ పిటిషన్ పై తదుపరి విచార‌ణను సీబీఐ కోర్టు ఈ నెల 13కు వాయిదా వేసింది. విజయసాయిరెడ్డి కోర్టు షరతులు ఉల్లంఘించారంటూ ఈ నెల 7న‌ రఘురామ కృష్ణ‌రాజు పిటిషన్ వేసిన విష‌యం తెలిసిందే.

దీంతో బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణలో భాగంగా విజయసాయిరెడ్డికి, సీబీఐకి కోర్టు నోటీసులు జారీ చేసింది. ర‌ఘురామ వేసిన‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగానే ఈ రోజు  విజయసాయి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది.

అయితే, కౌంటర్‌ దాఖలుకు మరింత గడువు కావాలని సీబీఐ అధికారులు కోరారు. ఈ నేప‌థ్యంలోనే విచార‌ణ వాయిదా ప‌డింది. ఇప్ప‌టికే అక్ర‌మాస్తుల కేసులో సీఎం జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాల‌ని ర‌ఘురామ వేసిన పిటిష‌న్‌పై కూడా కోర్టులో విచార‌ణ కొన‌సాగుతోన్న విష‌యం తెలిసిందే.

CBI
Supreme Court
India
Vijay Sai Reddy
Raghu Rama Krishna Raju
  • Loading...

More Telugu News