ఈ సమస్యలు పరిష్కరిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను... కావాలంటే బాండ్ రాసిస్తా: కోమటిరెడ్డి
- చౌటుప్పల్ లో ఎంపీ వ్యాఖ్యలు
- పెండింగ్ పనులు పరిష్కరించాలన్న కోమటిరెడ్డి
- పరిష్కరిస్తే పదవికి రాజీనామా చేస్తానని వెల్లడి
- రూ.1350 కోట్ల బకాయిలు ఉన్నాయని వివరణ
తన నియోజకవర్గంలో పనులకు సంబంధించి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు రూ.1,350 కోట్ల బకాయిలు పెట్టిందని కోమటిరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిల్లులు రాక కొందరు కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉందని వివరించారు.