Telangana: తెలంగాణలో కొత్తగా 746 కరోనా పాజిటివ్ కేసులు

Telangana covid spreading update

  • గత 24 గంటల్లో 1,20,165 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 71 కేసులు
  • నారాయణపేట జిల్లాలో 1 పాజిటివ్ కేసు
  • రాష్ట్రంలో ఐదుగురి మృతి
  • ఇంకా 9,836 మందికి చికిత్స

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,20,165 కరోనా పరీక్షలు నిర్వహించగా, 746 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 71, ఖమ్మం జిల్లాలో 61, కరీంనగర్ జిల్లాలో 57 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా నారాయణపేట జిల్లాలో ఒక పాజిటివ్ కేసును గుర్తించారు.

అదే సమయంలో 729 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,37,373 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,23,773 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 9,836 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా మృతుల సంఖ్య 3,764కి చేరింది.

Telangana
COVID19
New Cases
Deaths
  • Loading...

More Telugu News