Andhra Pradesh: ఏపీలో 2 వేలకు దిగువన రోజువారీ కరోనా కేసులు

AP Covid cases number dropped

  • గత 24 గంటల్లో 71,152 కరోనా పరీక్షలు
  • 1,628 మందికి కరోనా పాజిటివ్
  • తూర్పుగోదావరి జిల్లాలో 291 కేసులు
  • విజయనగరం జిల్లాలో 25 కేసులు
  • రాష్ట్రంలో 22 మంది మృతి

ఏపీలో గడచిన 24 గంటల్లో 71,152 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,628 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. ఇటీవల కాలంలో రాష్ట్రంలో అదే అత్యల్పం. తూర్పు గోదావరి జిల్లాలో 291, చిత్తూరు జిల్లాలో 261, నెల్లూరు జిల్లాలో 241, కృష్ణా జిల్లాలో 190 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 25 మందికి కరోనా నిర్ధారణ అయింది.

అదే సమయంలో 2,744 మంది కరోనా నుంచి కోలుకోగా, 22 మంది మరణించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఐదుగురు మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి మొత్తం కరోనా మృతుల సంఖ్య 13,154కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,41,724 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,05,000 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 23,570 మంది చికిత్స పొందుతున్నారు.

Andhra Pradesh
Corona Virus
New Cases
Deaths
  • Loading...

More Telugu News