Telangana: తెలంగాణలో కరోనా తగ్గుముఖం... 600కి దిగువన కొత్త కేసులు

Telangana covid daily cases update

  • గత 24 గంటల్లో 578 పాజిటివ్ కేసులు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 75 కేసులు
  • రెండు జిల్లాల్లో కొత్త కేసులు నిల్
  • రాష్ట్రంలో ముగ్గురి మృతి
  • 10 వేలకు దిగువన యాక్టివ్ కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి బాగా నెమ్మదించింది. గడచిన 24 గంటల్లో 90,966 కరోనా పరీక్షలు నిర్వహించగా, 578 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 75 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 53, ఖమ్మం జిల్లాలో 43 కరోనా కేసులు వెల్లడయ్యాయి. కొమరంభీమ్ ఆసిఫాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 731 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,36,627 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,23,044 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 9,824 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,759కి పెరిగింది.

Telangana
Corona Virus
New Cases
Deaths
  • Loading...

More Telugu News