Andhra Pradesh: ఏపీలో కొత్తగా 2,526 కరోనా పాజిటివ్ కేసులు

AP corona cases update

  • గత 24 గంటల్లో 93,785 కరోనా పరీక్షలు
  • తూర్పు గోదావరి జిల్లాలో 404 కేసులు
  • అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 35 కేసులు
  • రాష్ట్రంలో 24 మంది మృతి

ఏపీలో గడచిన 24 గంటల్లో 93,785 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,526 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 404 కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 391, ప్రకాశం జిల్లాలో 308 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 35 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 2,933 మంది కరోనా నుంచి కోలుకోగా, 24 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,32,105 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 18,93,498 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 25,526 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మృతుల సంఖ్య 13,081కి పెరిగింది.

Andhra Pradesh
Corona Virus
Daily Update
New Cases
Deaths
  • Loading...

More Telugu News