Jagan: నేడు జగన్ బెయిలు రద్దవుతుందంటూ కల్పిత కథనం.. సీఐడీకి ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు

YCP leaders Complaint CID ADGP On Social media post against ys jagan

  • ఓ వర్గం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కథనంలో సూచన 
  • 1988 డిసెంబరు, 1991 నాటి ఘటనలు పునరావృతం అయ్యే అవకాశం ఉందని కథనంలో హెచ్చరిక
  •  ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి 

అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిలు ఈ నెల 14న రద్దవుతుందంటూ సోషల్ మీడియాలో ఓ కథనం వైరల్ అవుతోందని, దీనిని ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఆ పార్టీ న్యాయవిభాగం అధ్యక్షుడు మనోహర్ మరికొందరు కలిసి సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్‌కు నిన్న ఫిర్యాదు చేశారు. ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా, ఓ వర్గం ప్రజలను రెచ్చగొట్టేలా ఈ కథనం ఉందని, ఈ కథనం ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

ముఖ్యమంత్రి బెయిలు రద్దవుతుందని, ఆ రోజున టీడీపీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆ కథనంలో పేర్కొన్నారని వైసీపీ నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే, కడప, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని ఓ వర్గం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరించారని తెలిపారు. ఈ విషయంలో పోలీసులను కూడా నమ్మవద్దని, 1988 డిసెంబరు, 1991 మేలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి ఘటనలే జరిగాయని, పోరాటం అంతిమ దశకు చేరుకుంటుండడంతో అప్రమత్తంగా ఉండాలని ఆ కథనంలో పేర్కొన్నారని నేతలు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News