Corona Virus: దేశంలో కొత్త‌గా 37,154 క‌రోనా కేసులు

Media Bulletin on status of positive cases COVID19 in india

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,08,74,376
  • నిన్న‌ 724 మంది మృతి
  • మృతుల సంఖ్య మొత్తం 4,08,764
  •  37,73,52,501 వ్యాక్సిన్ డోసుల వినియోగం

దేశంలో నిన్న‌ 37,154 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అలాగే, 24 గంట‌ల్లో 39,649 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,08,74,376కు చేరింది.

మరణాల విషయానికొస్తే, నిన్న‌ 724 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,08,764కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,00,14,713 మంది కోలుకున్నారు. 4,50,899 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశంలో ఇంతవరకు 37,73,52,501 వ్యాక్సిన్ డోసులు వేశారు. నిన్న 12,35,287 డోసులు వేశారు.

  • Loading...

More Telugu News