Corona Virus: దేశంలో నిన్న‌ 42,766 క‌రోనా కేసుల న‌మోదు

Media Bulletin on status of positive cases COVID19 in india

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,07,95,716
  •  నిన్న‌ 1,206 మంది మృతి
  •  మృతుల సంఖ్య మొత్తం  4,07,145
  •  మొత్తం 42,90,41,970 కరోనా పరీక్షలు  

దేశంలో నిన్న‌ 42,766 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అలాగే, 24 గంట‌ల్లో 45,254 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,07,95,716కు చేరింది.

మరణాల విషయానికొస్తే, నిన్న‌ 1,206 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,07,145కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,99,33,538 మంది కోలుకున్నారు. 4,55,033 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

   
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 42,90,41,970 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 19,55,225 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News