Sharwanand: షూటింగు పూర్తిచేసుకున్న 'మహాసముద్రం'

Mahasamudram Shooting Completed

  • భావోద్వేగాల 'మహాసముద్రం'
  • ప్రధాన పాత్రల్లో శర్వా .. సిద్ధూ 
  • నాయికలుగా అదితి .. అనూ 
  • విలన్ పాత్రలో 'గరుడ' రామ్ 
  • కీలకమైన పాత్రలో జగపతిబాబు    


అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ - సిద్ధార్థ్ హీరోలుగా 'మహాసముద్రం' సెట్స్ పైకి వెళ్లింది. 'ఆర్ ఎక్స్ 100' సినిమాతో భారీ విజయాన్ని నమోదు చేసిన అజయ్ భూపతి, ఆ తరువాత ప్రాజెక్టుగా ఈ సినిమాను పట్టాలెక్కించడానికి చాలా సమయమే పట్టింది. ఇక రెండు ప్రధానమైన పాత్రలకు హీరోలు సెట్ కావడానికి కూడా టైమ్ పట్టింది. అందువల్లనే ఆయన షూటింగు విషయంలో ఆలస్యం చేయలేదు. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం చకచకా షూటింగు కానిచ్చేశాడు.తాజాగా ఈ సినిమా షూటింగును పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, ఆయన ఒక స్పెషల్ పోస్టర్ ను వదిలాడు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ను కలుపుకుంటూ సాగే కథ ఇది. పాత్రల మధ్య సున్నితమైన భావోద్వేగాల ఘర్షణ .. సంఘర్షణ కనిపిస్తాయి. కథానాయికలుగా అదితీరావు .. అనూ ఇమ్మాన్యుయేల్ అలరించనున్నారు. ఇక ఒక కీలమైన పాత్రను జగపతిబాబు పోషించగా, ప్రతినాయకుడి పాత్రలో 'గరుడ' రామ్ కనిపించనున్నాడు. త్వరలోనే ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు.

Sharwanand
Siddharth
Adithi Rao
Anu Emmanuel
  • Loading...

More Telugu News