Andhra Pradesh: ఏపీలో మరో 2,982 మందికి కరోనా పాజిటివ్

AP Corona cases update

  • గత 24 గంటల్లో 91,070 కరోనా పరీక్షలు
  • తూర్పు గోదావరి జిల్లాలో 616 కేసులు
  • అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 32 కేసులు
  • రాష్ట్రంలో 27 మరణాలు
  • ఇంకా 31,850 మందికి చికిత్స

ఏపీలో గడచిన 24 గంటల్లో 91,070 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,982 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 616 కొత్త కేసులు నమోదు కాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 32 కేసులు గుర్తించారు. చిత్తూరు జిల్లాలో 401, పశ్చిమ గోదావరి జిల్లాలో 363, ప్రకాశం జిల్లాలో 345 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 3,461 మంది కరోనా నుంచి కోలుకోగా, 27 మంది మరణించారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో ఆరుగురు మృత్యువాతపడ్డారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 19,14,213 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 18,69,417 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 31,850 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 12,946కి పెరిగింది.

Andhra Pradesh
Corona Virus
New Cases
Deaths
Bulletin
Update
  • Loading...

More Telugu News