Corona Virus: దేశంలో నిన్న 39,796 క‌రోనా కేసులు

Media Bulletin on status of positive cases COVID19 in india

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,05,85,229
  • మృతుల సంఖ్య మొత్తం 4,02,728
  • మొత్తం 35,28,92,046 వ్యాక్సిన్ డోసులు  
  •  మొత్తం 41,97,77,457 కరోనా పరీక్షలు

దేశంలో నిన్న 39,796 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అలాగే, 24 గంట‌ల్లో 42,352 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,05,85,229కు చేరింది.

ఇక మరణాల విషయానికొస్తే, నిన్న‌ 723 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,02,728కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,97,00,430 మంది కోలుకున్నారు. 4,82,071 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. మొత్తం  35,28,92,046  వ్యాక్సిన్ డోసులు వేశారు.  
     
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 41,97,77,457 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 15,22,504 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News