India: దేశంలో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌

Media Bulletin on status of positive cases COVID19 in india

  • నిన్న 46,617 క‌రోనా కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,04,58,251
  • మృతుల సంఖ్య మొత్తం 4,00,312 మొత్తం
  • 41,42,51,520 కరోనా పరీక్షలు  

దేశంలో నిన్న 46,617 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దాని ప్రకారం... నిన్న 24 గంట‌ల్లో 59,384 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,04,58,251కు చేరింది.

ఇక మరణాల విషయానికొస్తే, నిన్న‌ 853 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,00,312కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,95,48,302 మంది కోలుకున్నారు. 5,09,637 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. మొత్తం 34,00,76,232 వ్యాక్సిన్ డోసులు వేశారు.  
   
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 41,42,51,520 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 18,80,026 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News