Telangana: తెలంగాణలో కొత్తగా 917 కరోనా పాజిటివ్ కేసుల నమోదు

Telangana Covid updates

  • గత 24 గంటల్లో 1,09,802 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 108 కేసులు
  • గద్వాల్ జిల్లాలో ఒక కేసు నమోదు
  • రాష్ట్రంలో 10 మంది మృతి

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,09,802 కరోనా పరీక్షలు నిర్వహించగా, 917 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 108 కొత్త కేసులు నమోదు కాగా, జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఒక కేసు నమోదైంది. అదే సమయంలో 1,006 మంది కరోనా నుంచి కోలుకోగా, 10 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో ఇప్పటివరకు 3,661 మంది కరోనాతో కన్నుమూశారు.

అటు రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,23,510కి పెరిగింది. ఇప్పటివరకు 6,06,461 మంది కరోనా నుంచి విముక్తులవగా, ఇంకా 13,388 మంది చికిత్స పొందుతున్నారు.

Telangana
Covid
Update
Positive Cases
  • Loading...

More Telugu News