Telangana: తెలంగాణలో కొత్తగా 987 కరోనా కేసులు

Telangana corona cases bulletin

  • గత 24 గంటల్లో 1,21,236 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 130 మందికి కరోనా
  • అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో ఒక కేసు
  • రాష్ట్రంలో ఏడుగురి మృతి

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,21,236 కరోనా పరీక్షలు నిర్వహించగా, 987 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 130 కొత్త కేసులు నమోదు కాగా, ఖమ్మం జిల్లాలో 102 మందికి కరోనా నిర్ధారణ అయింది. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో ఒక కేసు నమోదైంది. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 1,362 మంది కరోనా నుంచి కోలుకోగా, 7 మరణాలు సంభవించాయి. తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు 3,651 మంది కరోనాతో కన్నుమూశారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 6,22,593 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,05,455 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 13,487 మంది చికిత్స పొందుతున్నారు.

Telangana
Corona Virus
Bulletin
New Cases
Deaths
  • Loading...

More Telugu News