Corona Virus: దేశంలో మరింత తగ్గిన కొత్త కేసులు!

Media Bulletin on status of positive cases COVID19 in india

  • నిన్న48,698 క‌రోనా కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,01,83,143
  • మృతుల సంఖ్య మొత్తం 3,94,493
  • యాక్టివ్ కేసులు 5,95,565  

భార‌త్‌లో కొత్త‌ క‌రోనా కేసులు 50 వేల దిగువ‌కు చేరాయి. దేశంలో నిన్న 48,698 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దాని ప్రకారం.. 24 గంట‌ల్లో 64,818 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,01,83,143కు చేరింది.

ఇక మరణాల విషయానికొస్తే, నిన్న‌ 1,183 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,94,493కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,91,93,085 మంది కోలుకున్నారు. 5,95,565 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.  

  • Loading...

More Telugu News