Rythu Bandhu: తెలంగాణలో రైతుబంధు సాయం వివరాలు ఇవిగో!

Rythu Bandhu continues in Telangana

  • రైతులకు పెట్టుబడి సాయం
  • వర్షాకాలంలో 63.25 లక్షల మంది రైతులకు అర్హత
  • నేడు 17,776 మంది రైతుల ఖాతాల్లో జమ
  • ఇప్పటివరకు 60.74 లక్షల మందికి సాయం
  • రూ.7,298 కోట్లు విడుదల

తెలంగాణలో రైతుబంధు షురూ అయింది. రైతు బంధు పథకంలో భాగంగా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఈ వర్షాల సీజన్ లో 63.25 లక్షల మంది రైతులను రైతుబంధు పథకానికి అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. 2020తో పోల్చితే మరో 2,81,865 మంది రైతులకు ఈ పథకం వర్తింపజేస్తున్నారు. ఈ క్రమంలో నేడు 17,776 మంది రైతులకు లబ్ది చేరేలా రూ.120.16 కోట్ల మేర నిధులు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు 60.74 లక్షల మంది రైతులకు రూ.7,298.83 కోట్లు రైతుబంధు సాయం రూపంలో అందించినట్టు ప్రభుత్వం తెలిపింది.

Rythu Bandhu
Telangana
Farmers
Accounts
  • Loading...

More Telugu News