Sensex: ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

Markets ends in profits

  • భారీ లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు
  • లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
  • 14 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు భారీ లాభాల్లోకి దూసుకుపోయాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 482 పాయింట్ల వరకు లాభపడింది. అయితే ఆ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఇంట్రాడే లాభాలు హరించుకుపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 14 పాయింట్లు లాభపడి 52,588కి చేరుకుంది. నిఫ్టీ 26 పాయింట్ల లాభంతో 15,772 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మారుతి సుజుకి (5.11%), ఎల్ అండ్ టీ (2.19%), టైటాన్ కంపెనీ (0.96%), టీసీఎస్ (0.91%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.87%).

టాప్ లూజర్స్:
ఏసియన్ పెయింట్స్ (-2.10%), బజాజ్ ఫైనాన్స్ (-1.66%), నెస్లే ఇండియా (-1.26%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.14%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.87%).

  • Loading...

More Telugu News