Andhra Pradesh: ఏపీలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు

AP registers 5674 new Covid cases

  • గత 24 గంటల్లో కొత్తగా 5,674 కేసులు
  • కరోనా వల్ల 45 మంది మృతి
  • యాక్టివ్ కేసుల సంఖ్య 65,244

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 5,674 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1,068 కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 166 మంది కరోనా బారిన పడ్డారు. ఇదే సమయంలో 45 మంది మహమ్మారి వల్ల మృతి చెందారు. 8,014 మంది డిశ్చార్జ్ అయ్యారు.

తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 18,44,917కి చేరగా... 17,67,404 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 12,269 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 65,244 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Andhra Pradesh
Corona Virus
Updates
  • Loading...

More Telugu News