KTR: సూర్యాపేటలో కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్

KTR unveils Col Santosh Babu statue in Suryapet

  • గతేడాది గాల్వన్ లోయలో ఘర్షణలు
  • చైనా బలగాలతో వీరోచితంగా పోరాడిన సంతోష్ బాబు
  • వీరమరణం పొందిన వైనం
  • స్వస్థలం సూర్యాపేటలో 9 అడుగుల కాంస్య విగ్రహం

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సూర్యాపేటలో అమరవీరుడు కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

సంతోష్ బాబు స్వస్థలం సూర్యాపేట. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కల్నల్ సంతోష్ బాబు కాంస్య విగ్రహాన్ని సూర్యాపేటలోని కోర్టు చౌరస్తాలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విగ్రహం ఎత్తు 9 అడుగులు. కాగా, కల్నల్ సంతోష్ బాబు అమరుడైన అనంతరం, తెలంగాణ ప్రభుత్వం ఆయన కుటుంబానికి అండదండగా నిలిచింది. బంజారాహిల్స్ లో ఇంటిస్థలం, రూ.5 కోట్ల ఆర్థికసాయం, సంతోష్ బాబు భార్యకు గ్రూప్-1 హోదాతో ఉద్యోగం కల్పించారు.  

గత సంవత్సరం జూన్ 15న గాల్వన్ లోయలో చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో కల్నల్ బి.సంతోష్ బాబు వీరమరణం పొందడం తెలిసిందే. ఆయన వయసు 37 ఏళ్లు.

KTR
Santosh Babu
Statue
Martyr
Suryapet
Galwan Valley
India
China
  • Loading...

More Telugu News