మూడు రాజధానులపై వెనక్కి తగ్గేదిలేదు: బొత్స
- తాడేపల్లిలో మీడియా సమావేశం
- ఇప్పటికే మూడు రాజధానులపై చట్టం చేశామన్న బొత్స
- ఏ నిమిషానైనా చట్టం అమల్లోకి వస్తుందని వెల్లడి
- రాజ్యాంగం ప్రకారమే వెళుతున్నామని స్పష్టీకరణ
మూడు రాజధానులపై రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటున్నామని చెప్పారు. రాజధానులపై ఇప్పటికే చట్టం చేశామని, అది ఏ నిమిషాన అయినా అమలు కావొచ్చని అన్నారు. ఓ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడినుంచైనా పనిచేయవచ్చని తెలిపారు. కోర్టులో ఉన్న కేసులకు, ముఖ్యమంత్రి పనిచేయడానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. కోర్టుల్లో ఉన్న కేసులు త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని బొత్స వివరించారు.