Corona Virus: దేశంలో కొత్త‌గా 1,52,734 మందికి క‌రోనా

  Media Bulletin on status of positive cases COVID19 in india

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,80,47,534
  • నిన్న‌ 3,128  మంది క‌రోనాతో మృతి
  • మృతుల సంఖ్య మొత్తం 3,29,100
  • 21,31,54,129 మందికి వ్యాక్సిన్లు  

భార‌త్‌లో కొత్త‌ క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. నిన్న 1,52,734 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. వాటి ప్రకారం... నిన్న 2,38,022 మంది కోలుకున్నారు.

దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,80,47,534కు చేరింది. మరో 3,128  మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,29,100కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు  2,56,92,342 మంది కోలుకున్నారు. 20,26,092 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 21,31,54,129 మందికి వ్యాక్సిన్లు వేశారు.
      
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 34,48,66,883 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 16,83,135 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News