CCTV: డాక్ట‌ర్ దంప‌తుల‌ను న‌డిరోడ్డుపై కాల్చి చంపిన యువ‌కుడు.. వీడియో వైర‌ల్

Caught On CCTV Doctor Couple In Rajasthan Stopped Shot Dead in Car

  • రాజ‌స్థాన్‌లోని భ‌ర‌త్‌పూర్‌లో ఘ‌ట‌న‌
  • కారులో వెళ్తున్న డాక్ట‌ర్ దంప‌తుల‌ను అడ్డ‌గించి హ‌త్య‌
  • ఓ కేసులో నిందితులుగా ఉన్న డాక్ట‌ర్ కుటుంబం

రాజ‌స్థాన్‌లోని భ‌ర‌త్‌పూర్‌లో న‌డిరోడ్డుపై అంద‌రూ చూస్తుండ‌గా డాక్ట‌ర్ దంప‌తుల‌ను  ఓ యువ‌కుడు తుపాకీతో కాల్చి చంపాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్క‌డి సీసీటీవీ కెమెరాలో రికార్డ‌య్యాయి. ఈ ఘ‌ట‌న నిన్న సాయంత్రం చోటు చేసుకుంది.

డాక్ట‌ర్ దంప‌తులు ఓ కారులో వెళ్తుండ‌గా దాని వెన‌కాలే బైకుపై ఇద్ద‌రు యువ‌కులు వ‌చ్చి, న‌డిరోడ్డుపై కారు ముందు బైకును ఆపారు. దీంతో కారును ఆపిన డాక్ట‌రు విండో తెర‌చాడు. ఆ వెంట‌నే ఓ యువ‌కుడు బైకు దిగి తుపాకీ తీసి డాక్ట‌ర్ దంప‌తులపై కాల్పులు జ‌రిపాడు.

ఆ స‌మ‌యంలో మ‌రో యువ‌కుడు బైకుపైనే కూర్చున్నాడు. కాల్పులు జ‌రిపిన యువ‌కుడు ఆ వెంట‌నే బైకు ఎక్క‌గా, మ‌రో యువ‌కుడు బైకును న‌డిపాడు. ఇద్ద‌రూ అక్క‌డి నుంచి పారిపోయారు. రెండేళ్లుగా విచార‌ణ జ‌రుగుతోన్న ఓ యువ‌తి హ‌త్య‌ కేసులో డాక్ట‌ర్ కుటుంబ స‌భ్యులు నిందితులుగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే వారిపై కాల్పులు జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

రెండేళ్ల క్రితం హ‌త్య‌కు గురైన యువ‌తి సోద‌రుడే డాక్ట‌ర్ దంప‌తుల‌పై కాల్పులు జ‌రిపిన‌ట్లు పోలీసులు గుర్తించారు. డాక్ట‌ర్‌తో గ‌తంలో ఆ యువ‌తికి సన్నిహిత సంబంధం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆ యువ‌తి హ‌త్య‌కు గురైంది. ఈ కేసులో డాక్ట‌ర్ భార్య‌తో పాటు ఆయ‌న త‌ల్లి కూడా నిందితులుగా ఉన్నారు.

  • Loading...

More Telugu News