Corona Virus: దేశంలో 44 రోజుల్లో ఎన్న‌డూ లేనంత క‌నిష్ఠ స్థాయిలో కొత్త క‌రోనా కేసుల న‌మోదు

Media Bulletin on status of positive cases COVID19 in india

  • నిన్న 1,86,364 క‌రోనా కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,75,55,457
  • నిన్న‌ 3,660 మంది మృతి
  • మృతుల సంఖ్య మొత్తం 3,18,895

దేశంలో 44 రోజుల్లో ఎన్న‌డూ లేనంత క‌నిష్ఠ స్థాయిలో కొత్త క‌రోనా కేసులు న‌మోదయ్యాయి. నిన్న 1,86,364 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. వాటి ప్రకారం... నిన్న 2,59,459 మంది కోలుకున్నారు.

దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,75,55,457కు చేరింది. మరో  3,660 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,18,895కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,48,93,410 మంది కోలుకున్నారు. 23,43,152 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 20,57,20,660 మందికి వ్యాక్సిన్లు వేశారు.
       
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 33,90,39,861 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 20,70,508 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News