Kishan Reddy: బ్లాక్‌ఫంగ‌స్ ఔష‌ధాల ఉత్ప‌త్తి గురించి 11 సంస్థ‌ల‌తో చ‌ర్చించాం: కేంద్రమంత్రి కిష‌న్ రెడ్డి

kishan reddy vistis ent hospital

  • బ్లాక్ ఫంగ‌స్‌కు వాడే ఔష‌ధాల కొర‌త ఉన్న మాట వాస్త‌వ‌మే
  • అవ‌స‌ర‌మైన ఔష‌ధాల‌ను దిగుమ‌తి చేసుకుంటాం
  • దేశంలోనూ ఔష‌ధాల ఉత్ప‌త్తి పెరిగేలా చర్య‌లు
  • ప్ర‌తి పౌరుడు కరోనా వారియ‌ర్‌గా నడుచుకోవాలన్న మంత్రి

కేంద్ర స‌హాయ‌ మంత్రి కిష‌న్ రెడ్డి ఈ రోజు హైద‌రాబాద్‌లోని కోఠి ఈఎన్‌టీ ఆస్ప‌త్రిని సంద‌ర్శించి, అక్క‌డ బ్లాక్ ఫంగ‌స్ రోగుల‌కు అందుతోన్న చికిత్స‌పై ఆరా తీశారు. బ్లాక్ ఫంగ‌స్ బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు.

అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ... కొవిడ్-19 సోకి కోలుకున్న మ‌ధుమేహ రోగుల్లోనే బ్లాక్‌ఫంగ‌స్ స‌మ‌స్య త‌లెత్తుతోంద‌ని తెలిపారు. బ్లాక్ ఫంగ‌స్‌కు వాడే ఔష‌ధాల కొర‌త ఉన్న మాట వాస్త‌వ‌మేన‌ని కిష‌న్ రెడ్డి చెప్పారు. ఔష‌ధాల ఉత్ప‌త్తి గురించి 11 సంస్థ‌ల‌తో చ‌ర్చించామ‌ని పేర్కొన్నారు. ఇన్నాళ్లు బ్లాక్ ఫంగ‌స్ కేసులు చాలా అరుదుగా వ‌చ్చేవ‌ని, అందుకే దేశంలో దాని ఔష‌ధాల కొరత ఉంద‌ని తెలిపారు.

కొన్ని రోజులుగా క‌రోనా రోగుల్లో బ్లాక్ ఫంగ‌స్ కేసులు పెరిగిపోతున్నాయ‌ని కిష‌న్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అవ‌స‌ర‌మైన ఔష‌ధాల‌ను విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకుంటామ‌ని తెలిపారు. దేశంలోనూ ఔష‌ధాల ఉత్ప‌త్తి పెరిగేలా చర్య‌లు తీసుకుంటున్న‌ట్లు చెప్పారు. దేశంలోని ప్ర‌తి పౌరుడు కరోనా వారియ‌ర్‌గా  న‌డుచుకోవాలని తెలిపారు.

తెలంగాణ ప్ర‌భుత్వానికి ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్ర ప్ర‌భుత్వం 5,690 యాంఫోటెరిసిన్-బీ ఇంజ‌క్ష‌న్ల‌ను పంపించింద‌ని కిష‌న్ రెడ్డి వివ‌రించారు. దేశంలో పెరుగుతోన్న బ్లాక్ ఫంగ‌స్ కేసుల నేప‌థ్యంలో బాధితుల‌కు మెరుగైన‌ చికిత్స అందించేందుకు అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News