Corona Virus: దేశంలో క‌రోనాతో నిన్న‌ 4,454 మంది మృతి

Media Bulletin on status of positive cases COVID19 in india

  • కొత్త‌గా  2,22,315 మందికి కరోనా
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,67,52,447
  • మృతుల సంఖ్య మొత్తం 3,03,720  
  • 19,60,51,962 మందికి వ్యాక్సిన్లు  

దేశంలో గడచిన 24 గంట‌ల సమయంలో కొత్త‌గా  2,22,315 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న  3,02,544 మంది కోలుకున్నారు.

దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,67,52,447కు చేరింది. మరో 4,454 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,03,720కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,37,28,011 మంది కోలుకున్నారు. 27,20,716 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 19,60,51,962 మందికి వ్యాక్సిన్లు వేశారు.
 
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 33,05,36,064 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 19,28,127 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News