Corona Virus: దేశంలో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌

Media Bulletin on status of positive cases COVID19 in india

  • కొత్త‌గా  2,57,299  మందికి కరోనా
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,62,89,290
  • మరో 4,194 మంది మృతి
  • మృతుల సంఖ్య మొత్తం 2,95,525  

దేశంలో గడచిన 24 గంట‌ల సమయంలో కొత్త‌గా  2,57,299 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 3,57,630 మంది కోలుకున్నారు.

దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,62,89,290కు చేరింది. మరో 4,194 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 2,95,525కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,30,70,365 మంది కోలుకున్నారు. 29,23,400 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 19,33,72,819 మందికి వ్యాక్సిన్లు వేశారు.
         
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 32,64,84,155 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న  20,66,285 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News