Corona Virus: నిన్న క‌రోనాతో దేశంలో 4,209 మంది మృతి

 Media Bulletin on status of positive cases COVID19 in india

  • కొత్త‌గా 2,59,591 మందికి కరోనా
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,60,31,991
  • మృతుల సంఖ్య మొత్తం 2,91,331
  • 30,27,925  మందికి వ్యాక్సిన్లు            

భార‌త్‌లో గడచిన 24 గంట‌ల సమయంలో కొత్త‌గా 2,59,591 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 3,57,295 మంది కోలుకున్నారు.

దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,60,31,991కు చేరింది. మరో 4,209 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 2,91,331 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,27,12,735 మంది కోలుకున్నారు. 30,27,925 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 19,18,79,503  మందికి వ్యాక్సిన్లు వేశారు.
         
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 32,44,17,870  కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 20,61,683 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News