Telangana: తెలంగాణలో కొత్తగా 3,982 మందికి కరోనా పాజిటివ్

Telangana corona details bulletin

  • గత 24 గంటల్లో 71,616 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 607 కొత్త కేసులు
  • అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 18 కేసులు
  • రాష్ట్రంలో 27 మంది మృతి
  • 5,186 మందికి కరోనా నయం

తెలంగాణలో మరోసారి తక్కువ సంఖ్యలోనే కొత్త కేసులు వచ్చాయి. గడచిన 24 గంటల్లో 71,616 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 3,982 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 607 కొత్త కేసులు వెలుగుచూశాయి. రంగారెడ్డి జిల్లాలో 262, ఖమ్మం జిల్లాలో 247, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 225 కేసులు గుర్తించారు. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 18 కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 5,186 మంది కరోనా నుంచి కోలుకోగా, 27 మంది మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటివరకు 5,36,766 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 4,85,644 మంది కోలుకున్నారు. ఇంకా 48,110 మందికి చికిత్స జరుగుతోంది. మొత్తం మృతుల సంఖ్య 3,012కి చేరింది.

తెలంగాణలో కరోనా రికవరీ రేటు మరింత పెరిగింది. ప్రస్తుతం తెలంగాణ రికవరీ రేటు 90.47 శాతం కాగా, జాతీయస్థాయిలో అది 85.6 శాతంగా నమోదైంది. దేశంలో కరోనా మరణాల రేటు 1.1 శాతం కాగా, తెలంగాణలో 0.56 శాతంగా ఉంది.

Telangana
Corona Virus
Bulletin
New Cases
Positive Cases
Recovery Rate
  • Loading...

More Telugu News