Corona Virus: చాలా రోజుల త‌ర్వాత దేశంలో 3 ల‌క్ష‌ల దిగువ‌కు రోజువారీ క‌రోనా కేసులు

Media Bulletin on status of positive cases COVID19 in india

  • కొత్త‌గా 2,81,386 మందికి కరోనా
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,49,65,463
  • నిన్న‌ 4,106 మంది కరోనా కారణంగా మృతి
  • మృతుల సంఖ్య మొత్తం 2,74,390

భార‌త్‌లో రోజువారీ క‌రోనా కేసుల‌ సంఖ్య చాలా రోజుల త‌ర్వాత మూడు ల‌క్ష‌ల క‌న్నా త‌క్కువగా న‌మోదైంది. నిన్న‌ కొత్త‌గా 2,81,386 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న  3,78,741 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,49,65,463కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 4,106 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,74,390కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,11,74,076  మంది కోలుకున్నారు.  35,16,997 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 18,29,26,460 మందికి వ్యాక్సిన్లు వేశారు.
     
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 31,64,23,658 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 15,73,515 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News