Corona Virus: దేశంలో క‌రోనాతో మ‌రో 3,417 మంది మృతి

Media Bulletin on status of positive cases COVID19 in india

  • కొత్త‌గా 3,68,147 మందికి కరోనా
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య‌  1,99,25,604
  • మృతుల సంఖ్య 2,18,959
  • 15,71,98,207 మందికి వ్యాక్సిన్లు
  • 29,16,47,037 కరోనా పరీక్షలు   

భార‌త్‌లో క‌రోనా కేసులు భారీగా న‌మోద‌వుతున్నాయి. నిన్న‌ కొత్త‌గా 3,68,147 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 3,00,732   మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య‌ 1,99,25,604కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 3,417 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,18,959కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,62,93,003 మంది కోలుకున్నారు. 34,13,642 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 15,71,98,207 మందికి వ్యాక్సిన్లు వేశారు.
   
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 29,16,47,037 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 15,04,698 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News