Corona Virus: దేశంలో మ‌రో 3.60 ల‌క్ష‌ల‌ మందికి కరోనా నిర్ధారణ.. 3,293 మంది మృతి

Media Bulletin on status of positive cases COVID19 in india

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,79,97,267
  • మృతుల సంఖ్య  2,01,187
  • 14,78,27,367 మందికి వ్యాక్సిన్లు
  • 28,27,03,789  కరోనా పరీక్షలు  

భార‌త్‌లో క‌రోనా ఉగ్ర‌రూపం దాల్చింది. నిన్న‌ కొత్త‌గా 3,60,960 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 2,61,162 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,79,97,267 కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో  3,293  మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,01,187 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,48,17,371 మంది కోలుకున్నారు. 29,78,709   మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 14,78,27,367 మందికి వ్యాక్సిన్లు వేశారు.
   
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 28,27,03,789  కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 17,23,912 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

 


  • Loading...

More Telugu News