Patna: వివాహ వేడుక నుంచి వస్తుండగా గంగా నదిలో పడిపోయిన వాహనం.. భారీ ప్రాణ నష్టం!

13 persons died in accident near Patna

  • పాట్నా సమీపంలో ఘోర ప్రమాదం
  • డ్రైవర్ సహా 13 మంది మృతి
  • కంట్రోల్ కోల్పోయి నదిలో పడిన వాహనం

బీహార్ లో ఈ ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. ఒక పెళ్లి వేడుకలో పాల్గొన్న వారిని తీసుకొస్తున్న పిక్ అప్ వ్యాన్ పాట్నా సమీపంలో ఉన్న దనాపూర్ లో గంగా నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా 13 మంది చనిపోయారని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సింగ్ తెలిపారు. నదిని దాటుతున్న సమయంలో కంట్రోల్ కోల్పోయిన వాహనం నదిలో పడిపోయిందని చెప్పారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటిస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి రామ్ కృపాల్ యాదవ్ ప్రమాద స్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. 

  • Loading...

More Telugu News