ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డికి కరోనా పాజిటివ్
- ఏపీలో పంజా విసురుతున్న కరోనా
- సామాన్యులతో పాటు, ప్రముఖులు కూడా వైరస్ బారిన పడుతున్న వైనం
- టెస్టులు చేయించుకోగా పాజిటివ్ అని తేలిందన్న గౌతమ్ రెడ్డి
తనకు స్వల్ప కరోనా లక్షణాలు కనిపించడంతో కోవిడ్ పరీక్షలు చేయించుకున్నానని... టెస్టుల్లో పాజిటివ్ అని తేలిందని గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం ఐసొలేషన్ లో ఉన్నానని... తగు చికిత్స పొందుతున్నానని తెలిపారు. గతం వారం రోజుల్లో తనను కలిసిన ప్రతి ఒక్కరూ కోవిడ్ ప్రొటోకాల్ ను పాటించాలని, కరోనా టెస్టులు చేయించుకోవాలని, అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.