Corona Virus: దేశంలో ఒక్క‌రోజులో మ‌రో 2.17 ల‌క్ష‌ల‌ మందికి కరోనా నిర్ధారణ

 Media Bulletin on status of positive cases COVID19 in india

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,42,91,917
  • మృతుల సంఖ్య 1,74,308
  • 11,72,23,509 మందికి వ్యాక్సిన్లు
  • 26,34,76,625 కరోనా పరీక్షలు

దేశంలో క‌రోనా కేసులు రోజురోజుకీ రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. నిన్న కొత్త‌గా 2,17,353 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 1,18,302 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,42,91,917కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 1,185  మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,74,308కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,25,47,866 మంది కోలుకున్నారు. 15,69,743 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 11,72,23,509 మందికి వ్యాక్సిన్లు వేశారు.

     
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 26,34,76,625 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 14,73,210 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News