Chandrababu: నేడు తిరుపతిలో చంద్రబాబు ఫుల్ బిజీ!

Chandrababu Busy in Tirupati Today

  • ప్రస్తుతం వెంకటగిరిలో ఉన్న చంద్రబాబు
  • సాయంత్రం 4.30 గంటల నుంచి తిరుపతిలో రోడ్ షో
  • ఆపై ప్రచార తీరుతెన్నులపై సమీక్ష

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నేడు తిరుపతిలో బిజీగా గడపనున్నారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారం నిమిత్తం రెండు రోజుల క్రితమే నియోజకవర్గానికి చేరుకున్న ఆయన ప్రస్తుతం వెంకటగిరిలో ఉన్నారు. ఈ మధ్యాహ్నం అక్కడి నుంచి బయలుదేరనున్న ఆయన, సాయంత్రం 4.30 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్ వద్దకు చేరుకుంటారు.

ఆ తరువాత రాత్రి 7.30 గంటల వరకూ ఆయన రోడ్ షో నగరంలో జరుగనుంది. ఆపై కృష్ణాపురం ఠాణా జంక్షన్ లో ఆయన ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం రాత్రి 8.30 గంటల వరకూ సాగనుంది. ఆపై మాజీ ఎమ్మెల్యే, మహిళా నేత సుగుణమ్మ క్యాంపు కార్యాలయానికి చేరుకునే చంద్రబాబు, అక్కడ టీడీపీ నేతలతో సమావేశమై, ప్రచార తీరుతెన్నులపై సమీక్ష నిర్వహించనున్నారు. రేపు ఆయన గూడూరుకు వెళ్లి, అక్కడి నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.

Chandrababu
Tirupati
Lok Sabha
By Poll
  • Loading...

More Telugu News