Tripura: త్రిపురలో దారుణం.. ఇద్దరు బాలికలపై 8 మంది యువకుల గ్యాంగ్ రేప్

Two minor girls gang raped in Tripura

  • అడవిలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం
  • బాలికలు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో యువకుల పరార్
  • ఓ బాలిక పరిస్థితి విషమం

త్రిపురలో దారుణం జరిగింది. ఇద్దరు బాలికలపై 8 మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఖౌవాయి జిల్లాలో జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ బాలిక పరిస్థితి విషమంగా ఉంది.

పోలీసుల కథనం ప్రకారం.. ఖటియాబరి ప్రాంతానికి చెందిన  ఇద్దరు బాలికలు తమ ఇద్దరు స్నేహితులతో కలిసి సోమవారం సాయంత్రం బైక్‌పై బయటకు వెళ్లారు. కొంతదూరం వెళ్లిన తర్వాత మరో ఆరుగురు యువకులు బైక్‌లపై వచ్చి వారిని కలిశారు. అందరూ కలిసి బాలికలను అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికలు అపస్మారక స్థితికి వెళ్లడంతో భయపడిన యువకులు వారిని అక్కడే వదిలేసి పరారయ్యారు.

బాలికలు కనిపించకపోవడంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారితో కలిసి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో అడవిలో అపస్మారకస్థితిలో ఉన్న బాలికలు కనిపించారు. పోలీసులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఓ బాలిక పరిస్థితి విషమంగా మారడంతో ఆమెను మరో ఆసుపత్రికి తరలించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

Tripura
Gang Rape
Crime News
  • Loading...

More Telugu News