నామినేషన్లు దాఖలు చేసిన జానారెడ్డి, నోముల భగత్
- 'సాగర్' ఉప ఎన్నిక నామినేషన్లకు ఈ రోజే చివరి రోజు
- ఇప్పటివరకు మొత్తం 20 మందికిపైగా నామినేషన్లు
- వచ్చేనెల 17న ఎన్నిక
అలాగే, కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థి డాక్టర్ పానుగోతు రవికుమార్ కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలుకు నేటి మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంది. ఇప్పటివరకు మొత్తం 20 మందికిపైగా నామినేషన్లు వేశారు. రేపు నామినేషన్ల పరిశీలన జరపనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 3 వరకు గడువు ఉంది. ఈ ఎన్నిక వచ్చేనెల 17న జరగనున్న విషయం తెలిసిందే. 2న ఫలితం వెల్లడవుతుంది.