లాభసాటి పంటలపై దృష్టి సారించండి... తెలంగాణ రైతులకు మంత్రి నిరంజన్ రెడ్డి సూచన
- సిద్ధిపేటలో ఆయిల్ పామ్ అవగాహన సదస్సు
- పాల్గొన్న హరీశ్రావు, నిరంజన్ రెడ్డి
- ఆయిల్ పామ్ సాగుకు అండగా నిలవాలని కేంద్రానికి లేఖ
- కేంద్రం నుంచి నిరాశజనక సమాధానం వచ్చిందన్న నిరంజన్
కానీ తాము సాగుకు అనువైన అనేక ప్రోత్సాహకాలను రైతులకు అందజేస్తున్నామని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ కృషికి తోడుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆయిల్ పామ్ సాగుకు అండగా నిలవాలని కోరుతూ గతంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు. అందుకనుగుణంగా కొన్ని ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని కోరామన్నారు.
కానీ, కేంద్రం స్పందన ఆశించిన స్థాయిలో లేదని విమర్శించారు. ఆయిల్ పామ్కు తెలంగాణ భూములు, వాతావరణం అనువైనవా? కాదా? అనే అంశం పరిశీలించి నిర్ణయిస్తామంటూ జాప్యం చేస్తున్నారని ఆరోపించారు.